Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51.73 పాయింట్లు నష్టపోయి 58,298.80, నిఫ్టీ 6.20 పాయింట్లు క్షీణించి 17,382 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాల దాదాపు 1,515 షేర్లు పురోగమించగా.. 1,735 షేర్లు క్షీణించగా.. 141 షేర్లు మారలేదు. నిఫ్టీలో సిప్లా, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఐటీ, హెల్త్కేర్ సెక్టార్ షేర్లు ఒకటి నుంచి రెండుశాతం వరకు ఎగబాకగా.. రియల్టీ ఇండెక్స్ ఒక శాతం పడిపోయింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.