ముంబై: మార్కెట్లు ఇవాళ డీలాపడ్డాయి. దారుణంగా పడిపోయాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 1200 పాయింట్లు కోల్పోయింది. గ్లోబల్ మార్కెట్లలో ఉన్న ఒడిదిడుకులు.. భారతీయ స్టాక్మార్కెట్లపై ప్రభావం పడింది. నిఫ్టీ కూడా 16,950 పాయింట్ల లోపు ట్రేడ్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం వల్ల.. ఆసియా షేర్లు కూడా పతనం అయ్యాయి. దాదాపు 14 నెలల తర్వాత కనిష్ట ట్రేడింగ్ నమోదు అయ్యింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో.. అమెరికా ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు కాస్త షేక్ అయ్యాయి.