ముంబై, ఫిబ్రవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. ఐటీ రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటం సూచీలకు కలిసొచ్చింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 454.67 పాయింట్లు అందుకొని 72,186.09 వద్ద ముగిసింది.
30 షేర్ల ఇండెక్స్లలో 19 షేర్లు లాభపడగా, 11 షేర్లు నష్టపోయాయి. 157.70 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 21,929.40 వద్ద నిలిచింది. దీంతో మదుపరుల సంపద అమాంతం పెరిగింది. మార్కెట్లు ర్యాలీ కొనసాగించడంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.4.21 లక్షల కోట్ల సంపదను పోగేసుకున్నారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల నికర విలువ రూ.4,21,755.4 కోట్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.3,86,83,2870.93 కోట్లకు చేరుకున్నాయి.