Sensex | రిటైల్ ద్రవ్యోల్బణంతోపాటు హోల్ సేల్ ద్రవ్యోల్బణం కూడా తగ్గడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా సోమవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ అంతా పాజిటివ్ గానే సాగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. దీంతో వడ్డీరేట్లు మళ్లీ ఇప్పట్లో పెరిగి అవకాశం లేదని తేలింది. తత్ఫలితంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్, రియాల్టీ, మీడియా స్టాక్స్ కు కొనుగోలు దారుల నుంచి మద్దతు లభించింది. ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణి కనిపించింది. ఈయూ సభ్య దేశాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి చేరుకోవడం, హోల్ సేల్ ద్రవ్యోల్బణం -0.92 శాతానికి పడిపోయాయి. ఫలితంగా ఆటోమొబైల్, బ్యాంకులు, రియాల్టీ స్టాక్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ స్వల్ప లాభాలతో 62,563 పాయింట్ల వద్దకు దూసుకెళ్లి 318 పాయింట్ల లబ్ధితో 62,346 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్ లో 18,459 పాయింట్ల గరిష్టం నమోదు చేసుకుని ట్రేడింగ్ ముగిసే సమయానికి 84 పాయింట్ల లబ్ధితో 18,399 పాయింట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ లో టాటా మోటార్స్ భారీగా లబ్ధి పొందింది. మార్చితో ముగిసిన త్రైమాసికం ఫలితాలతో సోమవారం టాటా మోటార్స్ స్టాక్ ఆరేండ్ల గరిష్ట స్థాయి రూ.537 పాయింట్లను తాకింది. ఐటీసీ దాదాపు రెండు శాతం లాభ పడింది. టెక్ మహీంద్రా, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ ప్రముఖంగా లాభ పడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లు 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. రియాల్టీ ఇండెక్స్ 4.3 శాతం, ఎఫ్ఎంసీటీ ఇండెక్స్ ఒకశాతం, ఆటో, బ్యాంకెక్స్ ఇండెక్స్ లు 0.6 శాతం చొప్పున లాభ పడ్డాయి.