Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో మూడురోజుల లాభాలకు బ్రేక్పడినట్లయ్యింది. హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు పతనం కాగా.. సూచీలు నష్టాల బారినపడ్డాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 73,200.23 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి సెన్సెక్స్ పతనమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ సెన్సెక్స్ కోలేకోలేదు. గరిష్ఠంగా 73,301.47 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 73,301.47 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 117.58 పాయింట్ల నష్టంతో 72,987.03 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 17.30 పాయింట్లు కోల్పోయి.. 22,200.55 వద్ద ముగిసింది.
ఇవాళ ట్రేడింగ్లో కోల్ ఇండియా, సిప్లా, బీపీసీఎల్, భారతి ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పేయింట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ నష్టాల్లో ముగిశాయి. కీలమైన యూఎస్ ద్రవ్యోల్బణం డేటా ముద్రణకు ముందు.. మార్కెట్లపై ప్రభావం చూపింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.4శాతం లాభపడింది. నిఫ్టీ రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం వృద్ధిని నమోదు చేశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఒకశాతం క్షీణించింది. నిఫ్టీ ఆటో 0.5శాతం పడిపోయింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 0.3శాతం పడిపోయాయి.