Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 635 పాయింట్ల నష్టపోయి 61,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 18,199 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 741 పాయింట్లు క్షీణించి 42,617 వద్ద స్థిరపడింది. ఫార్మా ఇండెక్స్ 2.39 శాతం, హెల్త్ కేర్ ఇండెక్స్ 2.67 శాతం, ఐటీ ఇండెక్స్ 0.53 శాతం చొప్పున పెరిగాయి.
బుధవారం మార్కెట్లో సన్ ఫార్మా, హెచ్సీఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 522.12 పాయింట్లు క్షీణించి 61,180 పాయింట్ల వద్ద, నిఫ్టీ 181.75 పాయింట్లు కోల్పోయి 18,203 వద్ద స్థిరపడింది. దాదాపు 801 షేర్లు వృద్ధిని నమోదు చేయగా.. 2,727 షేర్లు క్షీణించాయి. 116 షేర్లలో మార్పు కనిపించలేదు.