ముంబై, నవంబర్ 8: ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నడుమ భారత సూచీలు బుధవారం లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 65,124 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది.
అయితే ముగింపులో కొంతమేర లాభాల స్వీకరణ ఫలితంగా 64,975 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితంరోజుకంటే 33 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 19,443 వద్ద నిలిచింది.