న్యూఢిల్లీ, మార్చి 14: హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో ప్రతిపాదించిన ఆఫర్ పరిమాణం రూ. 2,000 కోట్లు వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాస్పెక్టస్లో ఈ సంస్థ రూ. 280 కోట్ల విలువైన తాజా షేర్లను పబ్లిక్ ఇష్యూగా జారీచేస్తామని, 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఓఎఫ్ఎస్ రూపేణా విక్రయిస్తారని పేర్కొంది. రమేష్ కంచర్ల ప్రమోట్ చేసిన రెయిన్బో..యూకేకు చెందిన ఆర్థిక సంస్థ సీడీఎస్ గ్రూప్ మద్దతుతో 1999లో హైదరాబాద్లో 50 పడకల హాస్పిటల్ను ఏర్పాటుచేసింది.