ముంబై, సెప్టెంబర్ 1: బాసెల్ నిబంధనలకు అనుగుణమైన అదనపు టైర్ 1 (ఏటీ1) బాండ్ల ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలియజేసింది. 7.72 శాతం కూపన్ రేటుతో ఈ బాండ్లను బ్యాంక్ జారీ చేసింది. కాగా, ఈ బాండ్లకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. బేస్ ఇష్యూ పరిమాణం రూ.1,000 కోట్లుంటే రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్లు దాఖలయ్యాయి.