న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏఎంఎస్ఎల్..హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన నూతన ప్రాజెక్టుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.110 కోట్ల రుణాన్ని మం జూరు చేసింది. తెలంగాణలో రూ.210 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్(ఏఎంఎస్ఎల్) ప్రకటించిన విషయం తెలిసిందే. మౌలిక, రవాణా, ఏరోస్పేస్ రంగాలతోపాటు ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నది.