న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (సెబీ) ఫైన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యింది. రెండు దశాబ్దాల క్రితం నాటి సంస్థ షేర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులపై రూ.25 కోట్ల ఫైన్ విధించిన సంగతి తెలిసిందే.
సెబీ ఆదేశాలకు వ్యతిరేకంగా సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎస్ఏటీ)లో పిటిషన్ వేయనున్నట్లు రిలయన్స్ గురువారం తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం సంస్థలో అవకతవకలు జరిగాయని సెబీ పేర్కొంది. కానీ సెబీ టేకోవర్ రెగ్యులేషన్స్ 11(1) నిబంధన పరకారం ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరుగలేదని రిలయన్స్ వాదిస్తున్నది.
చట్టాలకు అనుగుణంగానే తమ సంస్థ ముందుకు వెళుతున్నదని తెలిపింది రిలయన్స్. ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, అనిల్ అంబానీ దంపతులు, కేడీ అంబానీలతోపాటు అంబానీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఫైన్ విధించింది సెబీ. 2000లో రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం రిలయన్స్ 6.83 శాతం వాటాల సబ్స్క్రిప్షన్ సంగతి వెల్లడించలేదని సెబీ ఆరోపణ.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్