ముంబై : (Reliance Company) రిలయన్స్ ఇండస్ట్రీస్ కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. దేశంలోనే అత్యుత్తమ ఎంప్లాయర్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. ఈ మేరకు బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్-2021 నివేదికను వెల్లడించింది. ప్రపంచంలోని అత్యుత్తమ యాజమన్యాల జాబితను విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు భారతదేశంలోని 19 కంపెనీలకు చోటు లభించింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ అత్యుత్తమ యాజమాన్యాల జాబితాలో దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచ స్థాయిలో 52 వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 750 పెద్ద కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. భారతదేశం నుంచి మొత్తం 19 కంపెనీలకు ఈ జాబితాలో చోటు లభించింది. టాప్ 100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీలలో ఐసీఐసీఐ బ్యాంక్ 65 వ స్థానంలో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 77, హెచ్సీఎల్ టెక్నాలజీ 90 వ స్థానంలో నిలిచాయి.
అలాగే, ఎస్బీఐకి 119, లార్సన్ అండ్ టుర్బో 127, బజాజ్ 215, యాక్సిస్ బ్యాంక్ 254, ఇండియన్ బ్యాంక్ 314, అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ 404, అమర్రాజా 405, కోటక్ మహీంద్రా బ్యాంక్ 418, బ్యాంక్ ఆఫ్ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్ ఆఫ్ బరోడా 496, ఎల్ఐసీ 504, ఇన్ఫోసిస్ 588, టాటా గ్రూప్ 746 స్థానాల్లో నిలిచినట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది.
దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ యజమానిగా నిలిచింది. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్-2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రెండు నుంచి 7 వ స్థానం వరకు అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమేజాన్, యాపిల్, ఆల్ఫాబెట్, డెల్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. 8 వ స్థానంలో హువాయ్, అడోబ్ 9 వ స్థానం, జర్మనీ బీఎండబ్ల్యూ గ్రూప్ 10 వ స్థానంలో నిలిచాయి.
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు
దోమలకు ఇది నచ్చదు.. మీరు అలా పెట్టగానే ఇలా పరార్..!
బంగ్లాదేశ్లోని ఆలయాలపై దాడులు, పండల్స్ ధ్వంసం
ఎయిరిండియా ఐపాయే.. ఇప్పుడిక వీటి వంతు..!
కొవిడ్ మూలాలు తెలుసుకునే చివరి ప్రయత్నం.. చైనాకు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు
నార్వేలో బాణంతో దాడి, ఐదుగురు మృతి
3.65 లక్షల మందితో కలిసి బౌద్ధమతం స్వీకరించిన అంబేడ్కర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..