హైదరాబాద్, జూన్ 6: ఒడిశాలో జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంలో బాధితులకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయ చర్యల్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపిన ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత కుటుంబాలకు మద్దతుగా 10 రకాల సహాయ చర్యల్ని అమలు జరుపుతున్నట్టు వివరించారు.
ప్రమాద బాధితులను చేరవేస్తున్న అంబులెన్స్లకు జియో-బీపీ నెట్వర్క్ ద్వారా ఉచిత ఇంధనం, బాధిత కుటుంబాలకు రిలయన్స్ స్టోర్ల ద్వారా ఆరు నెలలపాటు ఉచిత రేషన్, గాయపడినవారికి ఉచిత ఔషధాలు, హాస్పిటల్లో చేరేవారికి ఉచిత చికిత్స, మృతిచెందినవారి కుటుంబంలో ఒకరికి జియో, రిలయన్స్ రిటైల్లో ఉద్యోగం, వికలాంగులైనవారికి చక్రాల కుర్చీలు, కృత్రిమ అవయవాల పంపిణీ, కుటుంబ సభ్యుడికి ఒక ఏడాదిపాటు ఉచిత మొబైల్ కనెక్టివిటీ చర్యల్ని రిలయన్స్ పౌండేషన్ ప్రకటించింది.