RBI | ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) కొరడా ఝుళిపించింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన కారణంగా రెండు బ్యాంకులపై చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)కు రూ.కోటి, ఎస్ బ్యాంక్ (Yes Bank)కు రూ.91 లక్షల భారీ జరిమానా విధించింది.
మార్చి 31, 2022 నుంచి బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించడంలో ఐసీఐసీఐ బ్యాంక్ విఫలమైనట్లు తేలింది. ప్రాజెక్టు రిపోర్టులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించకుండానే పలు సంస్థలకు టర్మ్లోన్లు ఇచ్చినట్లు గుర్తించింది. ఈ మేరకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని పలు నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.కోటి జరిమానా విధించింది. అదేవిధంగా.. కస్టమర్ సర్వీస్, అంతర్గత, కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా ఎస్బ్యాంక్కు రూ.91 లక్షలు ఫైన్ వేసింది.
Also Read..
Delhi Metro | ఢిల్లీ మెట్రో రైలు రూఫ్పై మంటలు.. వైరలవుతున్న వీడియో
Papua New Guinea | 2 వేల మంది సజీవ సమాధి.. ద్వీప దేశానికి భారత్ ఆర్థిక సాయం