న్యూఢిల్లీ, జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ వోచర్ల కోసం ఒక ప్లాట్ఫామ్ ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిద్ధమవుతున్నది. కేవలం వ్యాక్సినేషన్ కోసం ఉద్దేశించిన ఈ ప్రీ-పెయిడ్ వోచర్లను కంపెనీలు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి, వాటి ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు పంపవచ్చు. ఉద్యోగి కుటుంబానికంతటికీ సంస్థలు ఈ వోచర్లను డెలివరీ చేయవచ్చు. క్యాష్లెస్ వ్యాక్సినేషన్ కోసం ఉద్యోగులు ఆ వోచర్లను దవాఖానలకు షేర్ చేయడం ద్వారా టీకా వేయించుకోగలుగుతారు. దవాఖాన ఖాతాలో తక్షణమే నగదు జమ అవుతుంది. ఈ వోచర్లు జారీ చేసేందుకు కొన్ని బ్యాంకుల్ని ఎన్పీసీఐ ప్రస్తుతం షార్ట్లిస్ట్ చేస్తున్నదని పేమెంట్స్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.