Petrol Rates | పెరిగిపోతున్న ధరలను అదుపులోకి తేవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆదివారం నుంచి అమల్లోకి రానున్నది. లీటర్ పెట్రోల్పై రూ.8, లీటర్ డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏప్రిల్ ద్రవ్యోల్బణం ఎనిమిది సంవత్సరాల గరిష్టానికి తాకడంతో కేంద్రం పెట్రోల్, డీజిల్లపై ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు తెలుస్తున్నది. 2020లో కరోనా ఉధృతంగా సాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్లపై సెంట్రల్ టాక్సెస్ పెంచేసింది. 2020లో లీటర్ పెట్రోల్పై రూ.32.90, లీటర్ డీజిల్పై రూ.31.80 సుంకాలు పెంచింది.
శనివారం ఎక్సైజ్ డ్యూటీలో కోత విధించడం వల్ల లీటర్ పెట్రోల్పై రూ.9.50, లీటర్ డీజిల్పై రూ.7 ధర తగ్గుతుంది. ఇతర డ్యూటీలు తగ్గడం వల్ల ప్రజలపై పెట్రో భారం తగ్గనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు కేంద్ర చమురు సంస్థలు దేశీయంగా ధరలు పెంచేవి. తాజాగా శనివారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి రానున్నది.