Gold price | కరోనా ప్రభావిత పరిస్థితులు తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి దీపావళికి బంగారం కొనాలన్న ఆకాంక్ష పెరుగుతున్నది. రాబోయే మూడు నెలల్లో పుత్తడిని కొనాలని దాదాపు 28 శాతం నగరవాసులు భావిస్తున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది. మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘యూగౌవ్స్’ దివాలీ స్పెండింగ్ ఇండెక్స్ ప్రకారం పసిడిపై కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమైంది. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశీయంగా రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కుదేలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి-మార్చిలో తిరిగి కోలుకుంటున్న సంకేతాలు కనిపించినా.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షల్ని ఎత్తివేస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఈసారి పండుగ సీజన్పై వ్యాపారులు భారీ ఆశల్నే పెట్టుకుంటున్నారు. కాగా, గత నెల 17-20 తేదీల్లో దేశవ్యాప్తంగా 2,021 మంది అభిప్రాయాలతో ఆన్లైన్ వేదికగా ఈ సర్వేను యూగౌవ్ ఓమ్నీబస్ చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బ్యాంకులో అకౌంట్ ఉందా? ఒకటో తేదీ నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. అవేంటో తెలుసా
హైదరాబాద్ టు ముంబై.. 3 గంటలే జర్నీ.. ఎలాగో తెలుసా?!
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
చిప్ కొరతతో భారత్కు న్యూ మోడల్స్ సరఫరాల్లో తీవ్ర జాప్యం!
కరోనా తర్వాత బంగారం కొనుగోలుపై నగరవాసుల ఆలోచన ఇలా ఉందా?