న్యూఢిల్లీ: (Fraud Loans) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన బ్యాడ్ బ్యాంక్.. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) కు వివిధ బ్యాంకులు తమ ఫ్రాడ్ లోన్స్ విక్రయించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. ఎన్ఏఆర్సీఎల్కు రూ.లక్ష కోట్ల మోసపూరిత రుణాలను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నది. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి రావడమే తరువాయి అని సమాచారం. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొన్నది.
రుణదాతలకు ఫ్రాడ్యులెంట్ రుణాలను విక్రయించడానికి అనుమతించిన తర్వాత బ్యాంకులు.. ఎన్ఏఆర్సీఎల్, ఇతర ఏఆర్సీలకు దాదాపు రూ.లక్ష కోట్ల మోసపూరిత రుణాలను విక్రయించే అవకాశం ఉన్నది. ఆర్బీఐ డాటా ప్రకారం, గత మూడేండ్లలో రూ.3.95 లక్షల కోట్ల రుణ మోసాలను బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకుల ఈ చర్య.. బ్యాడ్ బ్యాంక్కు రూ.2 లక్షల కోట్ల రుణాలను పొందాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. మోసపూరిత రుణాలను బ్యాడ్ బ్యాంకుకు అమ్ముకునేందుకు ఆమోదం తెలుపాల్సిందిగా గతవారం రిజర్వ్ బ్యాంకును పలు బ్యాంకులు, అసెట్ మేనేజర్లు కోరాయి. రూ.2 లక్షల కోట్ల సేకరణ లక్ష్యాన్ని కలిగి ఉన్న ఎన్ఏఆర్సీఎల్, ఇప్పటికే రూ.89,000 కోట్ల రుణాలను గుర్తించింది. ఈ ఫ్రాడ్ రుణాలపై ప్రభుత్వం దాదాపు రూ.31,000 కోట్ల హామీని ఇచ్చింది.
వార్ మ్యూజియంను సందర్శించిన వెంకయ్యనాయుడు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..