Silver Chariot : జగన్నాథుడి రథయాత్ర (Jagannath Rath Yatra) కోసం పూరీ నగరం సహా అంతటా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్పుర్ (Udaypur) లో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్నాథుడి కోసం 95 కిలోల భారీ వెండి రథం సిద్ధమవుతోంది. మొత్తం 58 విడిభాగాలను కలిపి దాదాపు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో కళాకారులు రథాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం రథం విడిభాగాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రథయాత్రకు ఐదు రోజుల ముందు ప్రతి భాగాన్ని ఒక్కచోటుకు చేరుస్తారు. ఆ తర్వాత నైపుణ్యం గల శిల్పులు వాటిని నిర్ణీత క్రమంలో అమర్చుతారు. రథయాత్ర ముగిశాక వాటిని జాగ్రత్తగా వేరుచేసి భద్రపరుస్తారు. జూలై 16న జగన్నాథుడి ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.