జైపూర్ : (Venkaiah Naidu) రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం జైసల్మేర్లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. జైసల్మేర్లోని వార్ మ్యూజియంను సందర్శించారు. సాయంత్రం జోధ్పూర్కు వెళ్లి అక్కడి మెహ్రాన్ఘడ్ కోటను, మ్యూజియంను తిలకిస్తారు. సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలలో కుటుంబసమేతంగా హాజరుకానున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 5 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా తొలిరోజు ఆదివారం తనోట్ మాత ఆలయం, లంగేవాలా వార్ మ్యూజియాన్ని సందర్శించారు. రెండవ రోజు జైసల్మేర్, జోధ్పూర్లో పర్యటిస్తారు. జైసల్మేర్లోని జోధ్పూర్ రోడ్లో ఉన్న వార్ మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. వార్ మ్యూజియంలోని లంగేవాలా హాల్ వెలుపల ఒక మొక్కను కూడా వెంకయ్యనాయుడు నాటారు. ఉపరాష్ట్రపతి వెంట ఆయన భార్య ఉషా నాయుడు, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బీడీ కల్లా, ఎస్పీ అజయ్ సింగ్ తదితరులు ఉన్నారు. వార్ మ్యూజియంలో మేజర్ జనరల్ అజిత్ సింగ్ గెహ్లాట్ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. అమరవీరులు, సైనికుల కోసం తన ఆలోచనలను పంచుకోవడానికి అక్కడ ఉంచిన స్మారక పుస్తకంలో తన మనోభావాలను పొందుపరిచారు.
అనంతరం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నార్త్ హెడ్క్వార్టర్స్ 191 బెటాలియన్కు చేరుకున్నారు. అక్కడ ఆయన గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. బీఎస్ఎఫ్ డీఐజీ పంకజ్ ఘూమర్ ఘనంగా స్వాగతం పలికి బీఎస్ఎఫ్ టోపీని బహూకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సైనిక్ సదస్సులో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మధ్యాహ్న భోజనం అనంతరం ప్రత్యేక విమానంలో జోధ్పూర్ వెళ్తారు.
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..