న్యూఢిల్లీ, జనవరి 31: జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి నెలకుగాను రూ.1.55 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు రూ.1,55,922 కోట్ల మేర వసూలయ్యాయని తెలిపింది. దీంట్లో సీజీఎస్టీ కింద రూ.26,963 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.36,730 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.79,599 కోట్లు, సెస్ల రూపంలో రూ.10,630 కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన పన్ను వసూళ్లతో పోలిస్తే 24 శాతం అధికం. అలాగే రూ.1.50 లక్షల కోట్ల కంటే అధికంగా వసూలవడం కూడా ఇదే మూడోసారి.