న్యూఢిల్లీ, జూలై 8: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాదారులకు సంబంధించి 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నట్టు ప్రకటించింది.
ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ఐడీబీఐ బ్యాంక్కు చెందిన 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈకి చెందిన 1.80 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్నకు చెందిన 56 లక్షల షేర్లను విక్రయించనున్నది.