(SBI Wecare) న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘వికేర్’ స్పెషల్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఈ పథకం సెప్టెంబర్ 30 తో ముగియనున్నది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంపై ఎక్కువ వడ్డీని పొందుతారు. ఈ పథకంలో పౌరులు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి అందుకునే వడ్డీ కంటే 0.80 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు. నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.40 శాతం వడ్డీని ఇస్తున్నది.
ఈ పథకం కింద ఐదేండ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఐదేండ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి చేసే డిపాజిట్లకు 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఐదేండ్ల కాలానికి చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై సాధారణ పౌరుల కంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు. ఐదేండ్ల కంటే ఎక్కువ కాలానికి టర్మ్ డిపాజిట్లకు అదనంగా 0.30 శాతంతో పాటు 0.80 శాతం వడ్డీ ఇస్తారు. అంటే 6.20 శాతం వడ్డీ లభిస్తుందన్నమాట. ప్రీమ్యాచూర్ విత్డ్రాయల్పై అదనపు వడ్డీ ఇవ్వరు. నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదైన కస్టమర్లకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
హర్యానా పాల్వాల్లో దారుణం.. ఒకే ఇంట్లో ఐదుగురి ఆత్మహత్య
నేను రాజీనామా చేయలేదు: ఓం ప్రకాశ్ సోని
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..