రేవారి : (Palwal Suicides) హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే ఇంట్లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ పెద్ద ఉరేసుకుని చనిపోగా.. భార్య, ముగ్గురు పిల్లలు మరో గదిలో నేలపై పడి ఉన్నారు. పోలీసులు అనుమానాస్పద మరణాలుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఔరంగాబాద్ గ్రామంలో జరిగింది.
హర్యానా పాల్వాల్ జిల్లా పరిధిలోని ఔరంగాబాద్ గ్రామంలో బుధవారం ఉదయం ఒకే ఇంట్లో 5 మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ యజమాని ఉరేసుకుని కనిపించాడు, అతడి భార్య, ముగ్గురు పిల్లల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, భార్య, పిల్లలకు విషం ఇచ్చి చనిపోయిన తర్వాత ఇంటి పెద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను 33 ఏండ్ల నరేష్, అతడి భార్య 30 ఏండ్ల ఆర్తి, 7 ఏండ్ల కుమారుడు సంజయ్, 9 ఏండ్ల కుమార్తె భావన, 11 ఏండ్ల రవితగా గుర్తించారు. ఈ ఘటనపై సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు.
నరేష్ ఇంట్లో బుధవారం ఉదయం చాలా సేపు ఎలాంటి కదలికలు లేకపోవడాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు.. వారి ఇంటి తలుపులు తెరిచి చూడగా నరేశ్ ఉరేసుకుని కనిపించాడు. ఆర్తి, పిల్లల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. సమాచారం అందగానే పాల్వాల్ నగర పోలీసు బృందం చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
నేను రాజీనామా చేయలేదు: ఓం ప్రకాశ్ సోని
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..