న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ (Nokia Layoffs) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 14,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు నోకియా వెల్లడించింది.
ఉత్తర అమెరికా సహా కీలక మార్కెట్లలో 5జీ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా థర్డ్ క్వార్టర్ సేల్స్ 20 శాతం పడిపోయిన నేపధ్యంలో లేఆఫ్స్ వార్తలు వెలువడటం గమనార్హం. ఆపరేషన్స్ను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చులకు కళ్లెం వేసేందుకు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు నోకియా గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2026 నాటికి 14 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించే లక్ష్యంతో నోకియా పలు చర్యలు చేపడుతోంది.
తాజా లేఆఫ్స్తో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 72,000కు తగ్గనుంది. లేఆఫ్స్తో కంపెనీకి పెద్దమొత్తంలో నిధులు ఆదా అవుతాయని నోకియా లెక్కగడుతోంది. నోకియానే కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించకుని, వ్యాపార పునర్వ్యవస్ధీకరణ చేపట్టేందుకు వేలాది ఉద్యోగులను తొలగించాయి.
Read More :