Infosys | కొవిడ్ మహమ్మారి ప్రభావంతో 2020 నుంచి ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల పని తీరే మారిపోయింది. మహమ్మారి భారీన పడకుండా కార్యాలయాలు మూసేసి వర్క్ ఫ్రం హోం కల్చర్ తెచ్చాయి కార్పొరేట్ సంస్థలు. కరోనా ప్రభావం కనుమరుగు కావడంతో క్రమంగా కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం కల్చర్కు గుడ్ బై చెప్పేస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం పాలసీకి పూర్తిగా స్వస్తి పలికాయి. మరికొన్ని సంస్థలు కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోం, ఇంకొన్ని రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్ పేరుతో హైబ్రీడ్ పాలసీ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది.
అమెరికా, కెనడా దేశాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం సేవలు అందించడం ఇక నుంచి అనుమతించబోమని ఇన్ఫోసిస్ తేల్చేసింది. వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయడానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.