ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆక్సిజన్ అందకచనిపోయినట్లు భావిస్తోన్న రోగులను చెత్త వాహనాల్లో స్మశానాకి తరలించడం విమర్శలకు తావిస్తోంది. రాజ్ నందగావ్ జిల్లాలోని డోంగార్గావ్ లో నలుగురు కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. వీరంతా ఆక్సిజన్ అందక చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముగ్గురు రోగులు కోవిడ్ కేర్ సెంటర్ లో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ప్రాణాలు విడిచారు. వీరి మృతదేహాలను చెత్త ఎత్తికెళ్లే వాహనంలో స్మశానికి తరలించడం విమర్శలపాలవుతోంది.