న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వ రంగ ఖనిజ సంస్థ ఎన్ఎండీసీ నికరలాభం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 15.7 శాతం వృద్ధిచెంది రూ. 1,024.86 కోట్లకు చేరింది.
నిరుడు ఇదే కాలంలో రూ.885.65 కోట్ల లాభాన్ని కనబర్చింది. ఆదాయం రూ. 3,754.77 కోట్ల నుంచి రూ. 4,335 కోట్లకు చేరినట్టు ఎన్ఎండీసీ తెలిపింది.