హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎన్ఎండీసీ.. ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 8వ పీఎస్యూ అవార్డుల్లో ఎనిమిదింటిని సొం తం చేసుకున్నది. ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎండీ లీడర్షిప్, సీఎస్ఆర్ కమిట్మెంట్, నేషన్ బిల్డింగ్, డిజిటల్ పీఎస్యూ, రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్, హెచ్ఆర్ ఎక్సలెన్స్, కమ్యూనికేషన్ ఔట్రిచ్, ఎమర్జింగ్ కమ్యూనికేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ విభాగాల్లో ఎన్ఎండీసీకి అవార్డులు దక్కాయి.