గత కాలమ్లో సూచించిన రీతిలోనే ఎన్ఎస్ఈ నిఫ్టీ పటిష్ఠంగా బౌన్స్కావడమే కాదు.. వారంలో చివరిరోజున 22.127 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పింది. అయితే అక్కడ్నుంచి వేగంగా తగ్గి 21,854 పాయింట్ల వద్ద నిలిచింది. వారం మొత్తం మీద 501 పాయింట్లు లాభపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ద్రవ్యలోటు అంచనాను 5.8 శాతానికి తగ్గించడంతో పాటు వచ్చే ఏడాదికి ఆ లోటు 5.1 శాతంగానే ప్రతిపాదించడం, ప్రభుత్వ రుణ సమీకరణ లక్ష్యాన్ని తగ్గించడం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో శుక్రవారం నిఫ్టీ పెద్ద ర్యాలీ జరపగలిగింది.
కానీ అదే రోజున రికార్డు గరిష్ఠం నుంచి మెజారిటీ లాభాల్ని కోల్పోవడం టాప్అవుట్కు సంకేతమని ఇండియాచార్ట్స్ వ్యవస్థాపకుడు రోహిత్ శ్రీవాస్తవ చెప్పారు. శుక్రవారం నాటి కనిష్ఠస్థాయి 21,805 దిగువన ముగిస్తే స్వల్పకాలిక మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయినట్టు పరిగణించవచ్చన్నారు. ఒక రోజున టెక్నికల్ చార్టుల ఆధారంగా ట్రెండ్ను అంచనా వేయలేమని, ఈ సోమవారంనాటి కదలికల్ని పరిశీలించాల్సి ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ వివరించారు.
కీలక స్థాయి 21,805
ఈ సోమవారం నిఫ్టీ వ్యవహరించే శైలి రానున్న ట్రెండ్కు కీలకమని టెక్నికల్ అనలిస్టులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 21,805 పాయింట్ల దిగువన సూచీ ముగిస్తే బలహీనపడుతుందని, ఎగువన క్లోజ్ అయితే మరో కొత్త రికార్డును సృష్టించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 21,805పైన నిఫ్టీ రానున్న కొద్ది రోజుల్లో 22,300 పాయింట్లను అందుకుంటుందని, అటుపై 22,500 వర కూ పెరిగే అవకాశం ఉందని రాజేశ్ పాల్వియా విశ్లేషించారు.
స్వల్పకాలిక ఇన్వెస్టర్లు 21, 650 పాయింట్ల స్థాయిని స్టాప్లాస్గా నిర్దేశించుకోవాలని సూచించారు. నిఫ్టీ 21,805పైన ముగిస్తే మరో కొత్త గరిష్ఠస్థాయి 22,350 పాయింట్లను చేరవచ్చని రోహిత్ శ్రీవాస్తవ అంచనా వేశారు. ఈ వారం నిఫ్టీకి 21,500, 21,200 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుండగా, 22,222, 22,350 స్థాయిలు అవరోధం కల్గించవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ సాంకేతిక అంచనాల్ని వెల్లడించారు.