ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలతో చివర్లో కోలుకున్నాయి. ఐటీ, చమురు, బ్యాంకింగ్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో బుధవారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 242.83 పాయింట్లు ఎగబాకి 61,275.08 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తిరిగి 18 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. 86 పాయింట్లు లాభపడి 18,015.85 వద్ద స్థిరపడింది.