Stock Market | రెండురోజుల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 636.75 పాయింట్లు పతనమై.. 60,657.45 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 189.50 తగ్గి.. 18,043 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్లో 1,154 షేర్లు లాభపడగా.. 2,230 షేర్లు క్షీణించాయి. 135 షేర్లలో మార్పు కనిపించలేదు.
నిఫ్టీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్గా నిలిచాయి. దివీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు ఒక శాతం చొప్పున క్షీణించాయి.