Stock Markets | ముంబై, జూలై 26: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, చమురు రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడేలో 541 పాయింట్లు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 351.49 పాయింట్లు లాభపడి 66,707.20 వద్ద ముగిసింది.
అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 97.70 పాయింట్లు ఎగబాకి 19,778.30 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోవడంతో విదేశీ మదుపరులు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి భారీగా నిధులు చొప్పించారని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతిలు నష్టపోయాయి.