న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మరో ఈవీ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సీఎల్ఏ ఎలక్ట్రిక్ పేరుతో పిలిచే ఈ మాడల్ ప్రారంభ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్తో ఈ కారు 792 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని పేర్కొన్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో బుకింగ్లు ప్రారంభించింది.
బుకింగ్ చేసుకున్న కస్టమర్కు త్వరలో డెలివరీ చేయనున్నట్టు పేర్కొన్నది. సీఎల్ఏ 200 మాడల్ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..సీఎల్ఏ 250 + మాడల్ రూ.59 లక్షలు, సీఎల్ఏ 250+ మాడల్ విలువ రూ.64 లక్షలుగా నిర్ణయించింది. 58 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 542 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 85 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 792 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని తెలిపింది. కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీ సగం రీచార్జి కానున్నది.