Auto debit rules | బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి కీలక రంగాలకు సంబంధించిన సేవల్లో శుక్రవారం (అక్టోబర్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవేంటంటే..
80ఏండ్లు పైబడినవారు ఇకపై పెన్షన్ను సక్రమంగా అందుకోవాలంటే అక్టోబర్ 1 నుంచి డిజిటల్ ఫార్మాట్లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అన్ని హెడ్ పోస్టాఫీసుల్లో జీవన్ ప్రమాణ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీల నెలవారీ సబ్స్క్రిప్షన్లకు ఆటో డెబిట్ చెల్లింపులు అక్టోబర్ 1 నుంచి కస్టమర్ల అనుమతితోనే జరుగనున్నాయి. ఇందుకోసం చెల్లింపులు జరిగే 24 గంటలకు ముందు లావాదేవీలకు సంబంధించి సదరు బ్యాంకు వినియోగదారుడికి ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలి. కస్టమర్ అనుమతిస్తేనే.. చెల్లింపులను పూర్తిచేయాలి.
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్కు సంబంధించి పాత చెక్కు బుక్కులు, ఎంఐసీఆర్ కోడ్స్ అక్టోబర్ 1 నుంచి చెల్లబోవు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఈ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు.
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్ స్థాయి ఉద్యోగులు ఇకపై తప్పనిసరిగా సంస్థకు చెందిన మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలని సెబీ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుంచి స్థూల వేతనంలో 10% వేతనాన్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్ టు ముంబై.. 3 గంటలే జర్నీ.. ఎలాగో తెలుసా?!
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
చిప్ కొరతతో భారత్కు న్యూ మోడల్స్ సరఫరాల్లో తీవ్ర జాప్యం!