Mukesh Ambani | భారత ఇంటర్నెట్ రంగంలో సేవలందించేందుకు ప్రపంచ కుబేరులుగా పేరొందిన జెఫ్ బెజోస్ ( jeff bezos ), ఎలన్ మస్క్ ( elon musk ) ముందుకు వచ్చారని తెలుస్తోంది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇండియన్స్కు అందుబాటులోకి తెచ్చేందుకు వారు ఇద్దరూ వేర్వేరు ప్లాన్లతో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు చేశారని వినికిడి. హైస్పీడ్ బ్రాడ్బాండ్తోపాటు ఇంటర్నెట్ స్పేస్లోకి వారు అడుగిడేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ రంగాల్లో భారత్ టెలికం, బ్రాడ్బాండ్ రంగంలో సునీల్ మిట్టల్ సారధ్యంలోని ఎయిర్టెల్ ( Airtel ), ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలో జియో ( Reliance Jio ) సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
టెలికంశాఖ, అంతరిక్ష పరిశోధన శాఖలతో ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ స్టార్ లింక్, అమెజాన్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారని అధికార వర్గాల కథనం. అయితే వారు ఫార్మల్ రూట్లో లైసెన్స్ కోసం ఇంకా దరఖాస్తు చేయలేదు. భారత్ ఉపగ్రహాలను ఉపయోగించుకుని దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మస్క్, బెజోస్ ఆసక్తిగా ఉన్నారని టెలికం శాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో ఆ అమెజాన్, స్టార్ లింక్ ప్రతినిధులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తారని భావిస్తున్నామని ఆ వర్గాల కథనం.
ప్రస్తుతం సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలోని భారతీ గ్లోబల్ అనుబంధ వన్ వెబ్ వచ్చే ఏడాది భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఇందుకోసం టెలికంశాఖ నుంచి దేశవ్యాప్త లైసెన్స్ కూడా తీసుకున్నది.
భూమికి వెయ్యి కిలోమీటర్ల దూరం నుంచి.. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) శాటిలైట్స్ ద్వారా 1 జీబీపీఎస్ అంతకంటే ఎక్కువ స్పీడ్తో బాండ్విడ్త్ సేవలు అందించడానికి ఈ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీని ప్రకారం బిజినెస్ సంస్థలు, రైల్వేలు, నౌకాయాన సంస్థలు, రక్షణ సంస్థలు, ఎయిర్లైన్స్, దేశీయంగా పోటీ పడుతున్న ఎయిర్టెల్, జియో వంటి టెలికం కంపెనీల వంటి వివిధ రంగాల యూజర్లు, కస్టమర్లకు బాండ్విడ్త్ను విక్రయిస్తాయి.
మారుమూల గ్రామీణ ప్రాంతాలకు, పర్వత ప్రాంతాలకు, ఎడారులకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలకు కూడా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను తీసుకెళ్లవచ్చు. ఈ రెండు సంస్థలు ఎప్పుడు సర్వీసులు ప్రారంభించినా టెలికంశాఖ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని టెలికం శాఖ వర్గాల కథనం.
భారత్లో స్టార్ లింక్ ద్వారా బాండ్విడ్త్ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించారు ఎలన్ మస్క్. అందుకోసం ప్రభుత్వ నియంత్రణలు, విధి విధానాలను అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం పేపాల్ వ్యవస్థాపక ఉద్యోగి సంజయ్ భార్గవను స్టార్లింక్ భారత్ డైరెక్టర్గా నియమించారు.
గ్లోబల్ ఈ కామర్స్ జెయింట్ అమెజాన్ సైతం దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది. హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల దరికి చేరొచ్చని అంచనా వేస్తున్నది. తన ప్రాజెక్ట్ కౌపిర్ ద్వారా భారత్తోపాటు ప్రపంచమంతటా లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా బాండ్విడ్త్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఫోన్ సిగ్నల్ లేని చోటికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్.. అసలేంటి వన్వెబ్ ?
జియో .. ఎయిర్టెల్.. వొడాఫోన్ కలుస్తాయా.. మిట్టల్ ఏమన్నారు?!
Jio Phone Next.. సక్సెస్ కావాలంటే.. ఇదీ కీలకం..!