మెదక్ మున్సిపాలిటీ, జూన్ 28: ప్రభుత్వం చేపడుతున్న హరితహారం,పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. జూలై 1 నుంచి నిర్వహించనున్న హరితహారంలో భాగంగా సోమవారం పట్టణంలోని ప్రధాన రోడ్డు డివైడర్ మధ్యలో మొక్క లు నాటారు.
రూ. 40 లక్షలతో సుందరీకరణ..
పట్టణంలోని చౌరస్తాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్ల సహకారంతో రూ.25 లక్షల నిధులతో సుందరీకరణ పనులు, సిగ్నల్స్ నాలుగున్నర కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపుల రకరకాల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎన్ కంపెనీ సౌజన్యంతో రూ. 15 లక్షలతో మరిని అభివృద్ధి సనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, అవారి శేఖర్, రాజలింగం, సమీయొద్దీన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో…
పెద్దశంకరంపేట, జూన్ 28: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. పెద్దశంకరంపేట లోని పాత గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి గ్రామసభలు నిర్వహించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీటీసీ వీణా సుభాశ్గౌడ్, ఈవో విఠల్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్రూరల్…
మెదక్రూరల్,జూన్ 28:హరితహారంలో మొక్కలు నాటడం కోసం ఏర్పాట్లు చేయాలన్ని ఎంపీడీవో శ్రీరాము లు అన్నారు. మంబోజిపల్లిలో రహదారికి ఇరువైపుల తీస్తు న్న గుంతలను ఎంపీడీవో శ్రీరాములు సర్పంచ్ ప్రభాక ర్ పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ ప్రతి నర్సరీల్లో 10వేలకు తగ్గకుండా సుమారు 3లక్ష ల వివిధ రకాల మొక్కలను పెంచుతున్నామన్నారు. కార్యక్రమంలో ఈసీ వేణుగోపాల్ , పంచాయతీ కార్యదర్శి లక్ష్మ ణ్ , సిబ్బంది పాల్గొన్నారు.