Tesla-Elon Musk | దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేసిన గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈవో ఎలన్మస్క్కు కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముందుగా దేశంలో ఉత్పత్తి ప్రారంభించాలని సూచించింది. ఆ తర్వాతే దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఏ కంపెనీకి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని పేర్కొన్నది. టెస్లాకు రాయితీ కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం వ్యాఖ్యానించింది.
భారత్ మార్కెట్పై పట్టు సాధించడం కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న టెస్లా వ్యవస్థాపక సీఈవో.. దిగుమతి సుంకాలు విధించాలని కోరారు. ముందు దిగుమతి చేసుకున్న కార్లను విక్రయిస్తామని, తర్వాతే మాన్యుఫాక్చరింగ్ చేపడతామని ప్రతిపాదిస్తూ ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు.
దిగుమతి సుంకాల తగ్గింపునకు టెస్లా భవిష్యత్ కార్యాచరణ ఏమిటో వెల్లడించాలని కేంద్రం సూచించింది. ఇక భారత్ మార్కెట్కు అనువైన టెస్లా మోడల్ కార్లను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో పూర్తిగా తయారైన కార్లపై 60-100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నది కేంద్రం.. దీన్ని 40 శాతం తగ్గించాలని టెస్లా కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!