Big Relief on IT Returns | వేతన జీవులకు ఆదాయం పన్ను శాఖ (ఐటీ) బిగ్ రిలీఫ్నిచ్చింది. ఐటీ రిటర్న్స్ అంచనాలను సమర్పించడానికి గడువును డిసెంబర్ 31 వరకు గడువును పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి ప్రభావంతోపాటు ఐటీ పోర్టల్లో సాంకేతిక లోపాలు కొనసాగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా జూలై నెలాఖరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు ముగుస్తుంది. కరోనా వల్ల దీన్ని సెప్టెంబర్ వరకు పొడిగిస్తున్నట్లు గత మే నెలలో ప్రకటించింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గడువును పొడిగించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆదాయం పన్ను చట్టం 139 సెక్షన్ (1) సబ్ సెక్షన్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. ఆ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాం. తాజాగా డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించినట్లు ఆదాయం పన్నుశాఖ పేర్కొంది.
కంపెనీలు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి తుది గడువును నవంబర్ నుంచి 2022 ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. టాక్స్ అడిటింగ్ రిపోర్ట్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికెట్ దాఖలు గడువును కూడా 2022 జనవరి 15 నుంచి 31 వరకు పొడిగించారు. దీనికి ప్రస్తుతం ఈ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు గడువు ఉంది. సవరించిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మరో రెండు నెలలు గడువు.. 2022 మార్చి 31 వరకు గడువు పొడిగించింది సీబీడీటీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!