సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్ను కేటీఆర్ ఆవిష్కరించారు. 50 ఎకరాల్లో ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో) పార్క్లో మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
ఈ పార్కు ప్రారంభోత్సవం నేపథ్యంలో కేటీఆర్ ఈ ఉదయం ట్వీట్ చేశారు. మహిళా పారిశ్రామిక పార్కులో తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించే మహిళా పారిశ్రామికవేత్తలందరికీ తన అభినందనలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
On the #InternationalWomensDay will be launching the women industrial park spread over 50 acres established by @FICCIFLO at Sultanpur in Sangareddy district
My compliments to all the women entrepreneurs who’ve kick started their entrepreneurial journey at this park 👍 pic.twitter.com/ZanV981AcG
— KTR (@KTRTRS) March 8, 2022