భారత మార్కెట్ నుంచి నిష్కమించనున్నట్లు ప్రకటించిన అమెరికా ఆటోమొబైల్ కంపెనీ సంస్థ ఫోర్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎంజీ మోటార్స్ ఇండియా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఫోర్డ్ ఇండియా యాజమాన్యతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్లోని సనంద్, తమిళనాడులోని మరాయి మళాయి నగర్ యూనిట్లను టేకోవర్ చేయడానికి ఎంజీ మోటార్స్ ఆసక్తిగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆ రెండు కంపెనీల వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించడానికి ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా నిరాకరించారు. ఇంతకుముందు ఫోర్ట్ ఇండియా యూనిట్లలో ఎంజీ మోటార్స్ ఉత్పాదక కాంట్రాక్ట్ పొందింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఉత్పత్తి తగ్గుదల, సేల్స్ పడిపోవడంతో దేశంలో విస్తరణ ప్రణాళికలకు ఫోర్డ్ ఇండియా స్వస్తి పలికింది.
తమ ఉత్పాదక యూనిట్లను పూర్తిగా విక్రయించడానికి సిద్ధం అని ఫోర్డ్ ఇండియా తేల్చేసింది. ఇదిలా ఉంటే, తమిళనాడులోని ఫోర్డ్ ఇండియా యూనిట్ను కొనుగోలు చేసేందుకు ఏదైనీ సంస్థ ముందుకు వస్తే, ఆ స్థలాన్ని సదరు సంస్థకు కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
SBI Home Loan | గుడ్న్యూస్.. వడ్డీ రేటు తగ్గింపు.. లోన్ ఎంతైనా ఒకే రేటు
Flying Cars : 2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
టెకీలకు బంపర్ బొనాంజా : క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపు, అదనపు బోనస్లు!