న్యూఢిల్లీ : ఫేస్బుక్ మాతృసంస్ధ మెటా (Meta), గూగుల్ మాతృసంస్ద ఆల్పాబెట్ ఇప్పటివరకూ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేశాయి. దిగ్గజ టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు పాల్పడినా గత ఏడాది అత్యధిక వేతనాలు చెల్లించిన టాప్ 3 కంపెనీల్లో టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్కు చోటు దక్కింది. 2022లో అత్యధిక వేతనాలు చెల్లించిన టాప్ కంపెనీల జాబితాను వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
కంపెనీల ఆర్ధిక సమాచారాన్ని విశ్లేషించే కంపెనీ మైలాగ్ఐక్యూ డేటాను ఉపయోగించి వాల్స్ట్రీట్ జర్నల్ ఈ వివరాలు తెలిపింది. ఎస్అండ్పీ 500 ఇండెక్స్ కంపెనీల్లో భాగమైన 278 కంపెనీల వేతనాల సమాచారాన్ని ఈ నివేదిక కోసం విశ్లేషించారు. ఈ వివరాల ఆధారంగా 2022లో అత్యధిక వేతనాలు చెల్లించిన కంపెనీల్లో మెటాకు రెండవ స్ధానం దక్కింది.
మెటా అత్యధికంగా 3,00,000 డాలర్ల మధ్యస్త వేతనంతో రెండవ స్ధానంలో నిలవగా, 2.8 లక్షల డాలర్ల వేతనంతో ఆల్ఫాబెట్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ విసి ప్రాపర్టీస్ 4.15 లక్షల వేతనంతో ఈ జాబితాలో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక గత ఏడాది నవంబర్లో మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది మార్చిలో 10,000 మందిపై వేటు వేసింది. మరోవైపు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది జనవరిలో కంపెనీ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సమాచారం అందించారు.
Read More :