మొయినాబాద్, సెప్టెంబర్ 8: మేఘా ఇంజినీరింగ్ సంస్థ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్నగర్లో బుధవారం సీఎన్జీ స్టేషన్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సంస్థ సీజీడీ రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్ఎస్ పవన్కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో మేఘా గ్యాస్ సేవలను విస్తరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తమకు ఇది రెండో సీఎన్జీ స్టేషన్ అన్నారు. మరో 12 ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సీఎన్జీ స్టేషన్లతోపాటు సీజీఎస్ మదర్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ శ్రావణ్కుమార్, పెట్రోల్ బంక్ డీలర్లు ఉమేష్, దీపక్ సింగ్, మేఘా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.