Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికం నికర లాభాల్లో మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసింది. గతేడాదితో పోలిస్తే 2022-23 రెండో త్రైమాసికంలో నాలుగు రెట్ల నికర లాభాలు గడించింది. గతేడాది రూ. 1,935 కోట్ల నికర లాభం గడించగా, ఈ ఏడాది రూ.2,062 కోట్ల లాభాలు పొందింది. ఆదాయం రూపేణా కూడా మారుతి సుజుకి సుమారు 46% శాతం వృద్ధి సాధించింది. రూ. 29,931 కోట్ల ఆదాయం సంపాదించింది.
ఈటీ నౌ పోల్స్ రూ. 29,558 కోట్ల నికర ఆదాయం మారుతి సుజుకి సంపాదిస్తుందని పేర్కొంది. వాహనాల సేల్స్లోనూ 36% గ్రోత్ నమోదైంది. గతేడాది 517,395 కార్లను మారుతి సుజుకి విక్రయించింది. ఆపరేటింగ్ మార్జిన్లు 9.25 శాతం పెరిగాయి. డిమాండ్కు అనుగుణంగా సేల్స్ పెరగడంతో లాభాల పెరుగుదలకు దారి తీసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి 4.12 లక్షల యూనిట్ల కార్ల డెలివరీలు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మోడల్స్ కార్ల ప్రీ-బుకింగ్స్ 1,30 లక్షల యూనిట్లు ఉన్నాయిన మారుతి సుజుకి తెలిపింది.