Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 25,500 పాయింట్ల దిగువకు చేరింది. గ్లోబల్ మార్కెట్లోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పొద్దంతా మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్లో అమ్మకాలతో మార్కెట్లు మరింత పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 83,625.89 పాయింట్ల నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 83,382.28 పాయింట్ల కనిష్టాన్ని చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 83,781.36 పాయింట్లకు చేరింది. చివరకు 176.43 పాయింట్లు తగ్గి 83,536.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.40 పాయింట్లు తగ్గి.. 25,476.10 వద్ద ముగిసింది.
ట్రేడింగ్లో దాదాపు 1,973 షేర్లు లాభపడగా.. 1,888 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా ఉన్నాయి. అయితే, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే మెటల్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 1.4 శాతం.. మీడియా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్ 0.5 శాతం, ఎఫ్ఎంసీజీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.3నుంచి 0.8 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.