Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్ 142.43 పాయింట్లు పెరిగి 60,806.22, నిఫ్టీ 21.80 పాయింట్లు పెరిగి 17,893.50 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్లో 1,670 షేర్లు పెరగ్గా.. 1,714 షేర్లు క్షీణించాయి. మరో 142 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరోమాటోకార్ప్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. సెక్టోరల్లో క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి