న్యూఢిల్లీ, మే 5: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.5,259.91 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,541.85 కోట్ల లాభంతో పోలిస్తే 48.5 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.42,585.67 కోట్ల నుంచి రూ.54,891.55 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,97,792.78 కోట్ల ఆదాయంపై రూ.18,621.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ బోర్డు సమావేశమై రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ రూ.33 తుది డివిడెండ్ను ప్రకటించింది.