న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
తొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.39 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్తో పోలిస్తే ఈ నయా మాడల్ రూ.1.50 లక్షల వరకు అధికం. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్లైన్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.