5G Smart Phones | దేశవ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ 4జీ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఇక నుంచి 5జీ ఇంటర్నెట్ సేవలు పొందాలంటే.. 5జీ స్మార్ట్ ఫోన్లో మాత్రమే లభిస్తాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేలలోపు అందుబాటులో ఉన్న టాప్ 5జీ స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దామా..!
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శ్యామ్ సంగ్.. గెలాక్సీ ఎం 13 సిరీస్ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.11,999లకు లభిస్తుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ రూ.13,999 పలుకుతున్నది. మూడు రంగుల్లో శ్యామ్సంగ్ గెలాక్సీ ఎం13 వస్తున్నది. ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లో 50 మెగా పిక్సెల్ (ఎంపీ) ప్లస్ 2 ఎంపీ రేర్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు జత చేశారు. 6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే గల శ్యామ్సంగ్ గెలాక్సీ ఎం 13 ఫోన్ 700 ఓక్టాకోర్ ప్రాసెసర్తో పని చేస్తుంది.
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్ మీ.. 10టీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లు, నాలుగు రంగుల్లో లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ కెపాసిటీ గల ఫోన్ రూ.12,999, 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.14,999 పలుకుతుంది. 48 మెగా పిక్సెల్ (ఎంపీ) + 2 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ రేర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ సామర్థ్యంగల బ్యాటరీతోపాటు 18 వాట్ల సూపర్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే కలిగి ఉంటుంది.
పొకో ఎం4 ప్రో 5జీ-స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 33 వాట్ల కెపాసిటీ గల ఫాస్ట్ చార్జర్ వస్తుంది. 4జీబీ రామ్ + 64జీబీ స్టోరేజీ కెపాసిటీ గల వేరియంట్ ఫోన్ రూ.14,999, 6జీబీ +128 జీబీ స్టోరేజీ కెపాసిటీ వేరియంట్ రూ.14,999, 8జీబీ +128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్ రూ.16,999లకు లభిస్తుంది. 50 మెగా పిక్సెల్ (ఎంపీ) + 8ఎంపీ డ్యూయల్ రేర్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు జత చేశారు. ఇది 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోంది. మీడియా టెక్ డైమెన్షన్ 810 ఓక్టాకోర్ ప్రాసెసర్తో పని చేస్తుంది.
రియాల్టీ నార్జో 30 మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ +64 జీబీ స్టోరేజీ కెపాసిటీ గల వేరియంట్ రూ.14,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.16,999లకు పొందొచ్చు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ప్లేతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. 48 మెగా పిక్సెల్ (ఎంపీ)+2ఎంపీ+ 2 ఎంపీ ట్రిపుల్ రేర్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
మోటో జీ51 మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తుంది. దీని ధర రూ.12,999. 20వాట్ల రాపిడ్ చార్జర్తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇస్తారు. సింగిల్ చార్జింగ్తో 30 గంటల పాటు పని చేయగల సామర్థ్యం దీని స్పెషాలిటీ. 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ప్లే కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ (ఎంపీ)+8 ఎంపీ+2 ఎంపీతోపాటు 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు ఉంటాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, వారణాసి, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి నగరాల పరిధిలో భారతీ ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ సేవలు అందిస్తున్నది. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తేవాలని ఎయిర్టెల్ భావిస్తున్నది. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 2023 డిసెంబర్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై నగరాల్లో జియో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి.