Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. అయితే, ఆ తర్వాత మరో వారం రోజులు అంటే అక్టోబర్ 7 వరకు గడువు పెంచింది. పెంచిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఆదివారం నుంచి రూ.2 వేల నోటు ఒక చరిత్రగా మిగిలిపోనుంది. ఈ నోట్ల మార్పిడికి ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన నేపథ్యంలో మరోసారి ఆ అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇక అక్టోబర్ 8 నుంచి బ్యాంకులు రూ. 2000 నోట్లను ఖాతాల్లో జమచేయడం, లేదా ఇతర బ్యాంక్ నోట్లతో ఎక్స్ఛేంజ్ను నిలిపివేస్తాయని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొంది. అందువల్ల ఇప్పటికీ పెద్ద నోటును మార్పిడి చేసుకోనివారు ఈరోజు సాయంత్రంలోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే నెలలో నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రకటన వెల్లడించే నాటికి రూ.3.44 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు వ్యవస్థలో ఉండగా.. ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.3.44 లక్షల కోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరాయి. అందులో సెప్టెంబర్ 1 నాటికి 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. కేవలం రూ. 12,000 కోట్ల విలువైన (3.37 శాతం) నోట్లు మిగిలిఉన్నాయి. జమైన వాటిలో 87 శాతం బ్యాంక్ డిపాజిట్లుగా వచ్చాయని, మిగిలినవి ఇతర నోట్లతో ఎక్స్ఛేంజ్ చేసుకున్నారని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. కాగా, రూ.2 వేల నోటును ఆర్బీఐ 2016 నవంబర్లో ప్రవేశపెట్టింది. అయితే 2018-2019లోనే ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది.
Also Read..
Air India | ఎయిర్ ఇండియా విమానాల కొత్త లుక్.. ఫొటోలు వైరల్
Advanced Childbirth | ముందస్తు జననాలు భారత్లోనే ఎక్కువ.. గ్రీస్, అమెరికా వంటి సంపన్న దేశాల్లోనూ
Uttar Pradesh | ఐదేండ్ల బాలికపై అత్యాచారం చేసి ఆత్మహత్య చేసుకున్న 60 ఏండ్ల వృద్ధుడు